షర్మిల యాత్ర - రాహుల్ సమర్పణ

 

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమయ్యేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తోందని రాష్ట్రంలో తలపండిన కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జరుగుతున్న పరిణామాల్నిచూస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వైకాపాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టడమే లక్ష్యంగా వ్యూహాలు సాగుతున్నాయనికూడా కొందరంటున్నారు. అంచనాల్ని తలక్రిందులు చేస్తూ తెలుగుదేశంపార్టీకి గతవైభవాన్ని కట్టబెట్టేందుకు చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నామీకోసం యాత్రకు జనంనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. టిడిపికి జనంలో పెరుగుతున్న ఆదరణనుచూసి కంగారుపడ్డ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీగా వై.ఎస్ జగన్ చెల్లెలు షర్మిలని రంగంలోకి దించుతోంది. ఇడుపులపాయనుంచి మొదలయ్యే షర్మిలయాత్రకి రూట్ మ్యాప్ కూడా ఖరారయ్యింది. అంతా బాగానే ఉంది కానీ ఈ యాత్రకు అసలు స్పాన్సరర్ ఎవరన్నదానిమీద ఇప్పుడు జనంలో ఉత్కంఠ బయలుదేరింది. రాహుల్ ప్రథాని కావాలంటే రాష్ట్రంనుంచి కనీసం పాతికమంది ఎంపీల మద్దతు తప్పదు. కాంగ్రెస్ నేతల్ని మాత్రమే నమ్ముకుని కూర్చుంటే ఓడలు బండ్లయ్యే ప్రమాదం ఉందన్న విషయం సోనియాకి స్పష్టంగా తెలుసు. ఈ పరిస్థితుల్లో అడ్డుపడి ఆదుకోగలిగిన సత్తా ఒక్క వై.ఎస్.ఆర్.సి.పికి మాత్రమే ఉందన్న విషయం సోనియాతోపాటు రాహుల్ కి కూడా స్పష్టంగా తెలుసు. రాష్ట్రపతి ఎన్నికల్లో వై.ఎస్ జగన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్ధికి ఓటేయడంకూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఎపిసోడ్ కి మంచి ఉదాహరణ అని చాలామంది చెవులు కొరుక్కున్నారుకూడా. ఈ పరిణామాలన్నింటినీబట్టి చూస్తే షర్మిలయాత్రకి రాహుల్ గాంధీ స్పాన్సర్ షిప్ వ్యవహారం నిజమే అయ్యుండచ్చని చాలామంది గట్టిగానే అనుకుంటున్నారు.

 

 

 

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమయ్యేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తోందని రాష్ట్రంలో తలపండిన కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జరుగుతున్న పరిణామాల్నిచూస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వైకాపాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టడమే లక్ష్యంగా వ్యూహాలు సాగుతున్నాయనికూడా కొందరంటున్నారు. అంచనాల్ని తలక్రిందులు చేస్తూ తెలుగుదేశంపార్టీకి గతవైభవాన్ని కట్టబెట్టేందుకు చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నామీకోసం యాత్రకు జనంనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. టిడిపికి జనంలో పెరుగుతున్న ఆదరణనుచూసి కంగారుపడ్డ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీగా వై.ఎస్ జగన్ చెల్లెలు షర్మిలని రంగంలోకి దించుతోంది. ఇడుపులపాయనుంచి మొదలయ్యే షర్మిలయాత్రకి రూట్ మ్యాప్ కూడా ఖరారయ్యింది. అంతా బాగానే ఉంది కానీ ఈ యాత్రకు అసలు స్పాన్సరర్ ఎవరన్నదానిమీద ఇప్పుడు జనంలో ఉత్కంఠ బయలుదేరింది. రాహుల్ ప్రథాని కావాలంటే రాష్ట్రంనుంచి కనీసం పాతికమంది ఎంపీల మద్దతు తప్పదు. కాంగ్రెస్ నేతల్ని మాత్రమే నమ్ముకుని కూర్చుంటే ఓడలు బండ్లయ్యే ప్రమాదం ఉందన్న విషయం సోనియాకి స్పష్టంగా తెలుసు. ఈ పరిస్థితుల్లో అడ్డుపడి ఆదుకోగలిగిన సత్తా ఒక్క వై.ఎస్.ఆర్.సి.పికి మాత్రమే ఉందన్న విషయం సోనియాతోపాటు రాహుల్ కి కూడా స్పష్టంగా తెలుసు. రాష్ట్రపతి ఎన్నికల్లో వై.ఎస్ జగన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్ధికి ఓటేయడంకూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఎపిసోడ్ కి మంచి ఉదాహరణ అని చాలామంది చెవులు కొరుక్కున్నారుకూడా. ఈ పరిణామాలన్నింటినీబట్టి చూస్తే షర్మిలయాత్రకి రాహుల్ గాంధీ స్పాన్సర్ షిప్ వ్యవహారం నిజమే అయ్యుండచ్చని చాలామంది గట్టిగానే అనుకుంటున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.